అర్ధరాత్రి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు,మరిద్దరు జర్నలిస్టులను అరస్టు చెయ్యటం పట్ల నా నిరసనను తెలియజేస్తున్నాను.ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల
యోగక్షేమాలు గురించి,సాధకబాధకాల గురించి ఏర్పడిన అంతర్జాతీయసంఘం కమిటి
COMMITTE FOR THE CONCERNED JOURNALISTS,NEWYORK(http://www.concernedjournalists.org/) సభ్యుడిగా ఇటీవల కాలములో పాత్రికేయులపట్ల కొన్ని
సంస్థలు ,వ్యక్తులు జరుపుతున్న అరాచకాలు,దాడులను పరిశీలిస్తుంటే అధికారపార్టీ,ప్రతిపక్షపార్టీ అని ఎలాంటి తేడాలు లేకుండా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని అవగతమౌతుంది.కానీ,కర్ర ఉన్న వాడిదే బర్రె అన్నసామెత ఇక్కడ పరోక్షంగా అమలుతుంది.కాస్త నోరు గలవాడిమీదో,పెద్దమీడియా సంస్థలలోనో పనిచేసేవారి మీద జరిగే దాడుల పట్ల వివిధ సంఘాల,మీడియా ఖండనలు,నిరసనలు ఒకరకంగా ఉంటే బక్కబడుగు వ్యక్తులు,సంస్థల్లో పని చేసేవారికి ఆమాత్రం సానుభూతి,సహానుభూతి కరువౌతుంది.
ఉదాహరణకి నెల్లూరు జిల్లా ఉదయగిరి లో వార్త విలేఖరికి జీవనాధారమైన హోటలును కూల్చి వేసారు.కానీ రాష్ట్రస్థాయిలో దాదాపు ఎలాంటి మద్దతు లభించలేదు
తాజా గొడవకు మూలకారణమైన బాడుగనేతలు అన్న వార్తాంశం పై ఆంధ్రభూమి సంపాదకులు యం.వి.ఆర్.శాస్త్రి గారు తన సహజశైలిలో ఇలా స్పందించారు.
Wednesday, June 25, 2008
Tuesday, June 24, 2008
Monday, June 23, 2008
Subscribe to:
Posts (Atom)