Saturday, December 22, 2007

బ్లాగుల బాగోగులు.....4


మహాశయులారా నిన్న మీకు మనవి చేసినట్లు గత అర్ధరాత్రి పన్నెండు గంటలకు నా ఆంగ్లబ్లాగులకు
అంత్యక్రియలు జరిపించాను ఒంటరిగా
.ఇక అసలు విషయానికి వస్తే,ఎందరో ప్రతిభావంతులయిన ఆంగ్లరచయితలూ,అధ్యాపకులు,విమర్శకులూ,మరి ముఖ్యంగా లక్షలాది విద్యార్ధులు ఉన్న మనదేశంలో బ్లాగింగు అనేది ఎందరికో ఒక అయాచితవరంలా దొరికింది. ఆంగ్లదినపత్రికలు,సాహిత్యపత్రికలూ,తమ రచనలను ప్రచురించవూ అని , గ్రహించిన సృజన శీలులంతా తమకు దొరికిన బ్లాగు మహాసౌధాన్ని తమరచనలతో సంవృద్ధి చేస్తూ,అలంకరిస్తూ,ఎన్నో దేశాలవారికన్నా, ఎంచక్కని ఇంగ్లీషులో రాస్తూ

భారతాంగ్లకేతనాన్ని, విశ్వవీధుల్లో సగర్వంగా ఎగురవేస్తున్నారు.అంతవరకూ బాగానే ఉంది కధ.ఐతేబ్లాగుల ప్రాముఖ్యం ఒకవేపు,బ్లాగుల్లో నాణ్యత పెరగటం మరోవేపు,బాగున్న వాటిల్లోనుంచి ఎత్తిపోతల పధకం కింద మనం ముద్ర గుద్దేసుకుంటే ఎవడు అడుగుతాడూ అనే తెగింపుతో కొన్ని పత్రికలూ,మరికొన్ని వెబ్ పోర్టల్సూ నిస్సిగ్గుగా,నిర్లజ్జగా,బ్లాగర్ల రచనలను తమస్వంత కంటెంటుగా ప్రచురించుకోవటం ప్రారంభించాయి.పాపం కొన్నాళ్ళు వాటి ఆటలు బాగానే సాగాయి.ఎంతగుట్టుగా చేసినా కొన్నిపనులు దాగవు.అలాగే దొంగపనులు అసలు దాగవు కదా.ఈ ఘనతవహించిన వెబ్ సైట్లు చేస్తున్న బాగోతం బయటపడటం,బ్లాగర్లందరూ ఒత్తిడి తీసుకు రావటంతో తప్పైపోయింది అనే అర్ధం వచ్చేలా వారు ఏదో ఒకమూల చిన్న సవరణలాంటిది ప్రకటించటం కూడా జరిగిపోయాయి.
దానితో మనవాళ్ళు మెయిన్ స్ట్రీం మీడియా కోరలు పీకాము,కొమ్ములు ఒంచాము అంటూ దంభాలు కొట్టుకోవటం ప్రారంభించారు.కాకపోతే ఈ హడావుడిలో మనవాళ్ళు కొన్ని ముఖ్యమైన అంశాలను కావాలనే విస్మరిస్తున్నరేమో అనే అనుమానం నాకు కలుగుతోంది.

0 comments: