Thursday, December 20, 2007

బ్లాగుల బాగోగులు....2


ప్రతి రోజూ చర్చావేదికలో ఒక చర్చనీయాంశం ఉండాలని మొదట భావించాను.దానికి తగ్గట్లే పెద్దలు సిబిరావు గారు ప్రతిపాదించిన అంశం మీదే ఇంకా చర్చ జరుగుతోంది.మిగిలిన మిత్రులు ఇంకా ఏమీ ప్రతిపాదనలు పంపలేదు.బ్లాగులపఠనీయతను పెంచటం,మరింతమంది పాఠకులను ,పేరెన్నిక గన్న వారిని బ్లాగర్లుగా కూడా మార్చటం అనేవి ప్రాధాన్యతాంశాలే అయినా
ప్రస్తుతం ఉన్న చదువరుల చేత వారి స్పందనను రాబట్టటంలో వస్తున్న నిర్లిప్త ధోరణి పట్ల కలవరపడుతున్నామని దాదాపు అందరూ అంటున్నారు.తెలుగులో బ్లాగుల సంఖ్య పెరగటం వల్ల చదవటం ఎక్కువయి,రాసేది తగ్గుతోందని మరి కొందరు అంటున్నారు.బ్లాగుల సంఖ్య పెరగటం ఆహ్వానించదగ్గ పరిణామమే.అలాగే ఒక్కో బ్లాగరు 9,10 బ్లాగులను నిర్వహించటం కూడా మనం చూస్తున్నాము.

ముందు ఒక విభాగానికి తమ రచనలను పరిమితం చేసుకుని తర్వాత మిగిలినవి ఎవరో రాస్తున్నారు,మనం రాయలేకపోతున్నామని అలోచిస్తూ కూడా ఇంకో బ్లాగు మొదలెట్టకుండా సర్దుకుపోతున్నవారూ ఉన్నారు.సృజనాత్మకతతో మిళితమైఉన్న ఏ రంగంలోని వారికయినా పాఠకుల/ప్రేక్షకుల/శ్రోతల స్పందన తెలుసుకోవాలనే భావన ఉండటం ఎంతో సహజం.మిగిలిన సాధనాలతో పోలిస్తే బ్లాగుల్లో తక్షణస్పందన ఎంతో సులభం,స్వల్పఖర్చు,కాలం సరిపోతాయి.అయితే బాగా విశ్లేష్ణాత్మకంగా రాయాలంటే దేనికయినా ఎక్కువ సమయం కావాల్సిందే అనేది నిర్వివాదాంశం.కానీ రకరకాల కారణాలతో ఆ స్పందన కరువౌతోంది.
తాను రాసిన రచన మీద పాఠకులు ఏమనుకుంటున్నారో అని రచయిత భావిస్తుండగా ఆ ఏమి రాద్దంలే కామెంటు అని పాఠకులు అనుకుంటూ పోతే ఇక దానికి అంతమెక్కడ? ప్రస్తుతానికి దాదాపు పాఠకులందరూ బ్లాగర్లే,బ్లాగ్లోకంలోకి ప్రవేశం కోసం ఒక బ్లాగునారంభించి ఇక అక్కడుంచి కేవలం వ్యాఖ్యానాలకే పరిమితమై పోతున్నవారినీ మనం చూస్తున్నాం.నాకు లాగా ఏదిపడితే అది రాయటం కాకుండా ఎంపిక చేసుకున్న అంశాల మీద రాయటం, రాయగలటం,ఒక కళ,తమ రచనల కోసం జనాన్ని ఎదురు చూసేలా చెయగలగటం మరో మహత్తర కళ.కానీ ఎందుచేతనో ఆ కళాకారులు పెద్దసంఖ్యలో దర్శనమివ్వట్లేదు.
కాసేపు ఆంగ్ల బ్లాగుల్లోకి వెళితే .....

0 comments: