
తెలుగు బ్లాగర్ల సంఖ్య తో పాటు వాసి కూడా పెరుగుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. అమెరికా బ్లాగర్లతో పోలిస్తే మన దేశంలో ముఖ్యంగా తెలుగులో బ్లాగురచన అనేది కొంచెం వెనుక ప్రారంభమయినా ఈరోజు గణనీయమైన సంఖ్యలో తెలుగు బ్లాగులు వెలువడుతున్నాయి.కూడలి,జల్లెడ,తేనెగూడు,తెలుగుబ్లాగర్స్ డాట్ కాం వంటివారి సేవ ఎంత చెప్పినా ఈవిషయంలో తీర్చుకోలేనిది.బ్రిటానికా, ఎన్ కార్టా వంటి వాటికి ధీటుగా ప్రత్యామ్నయ విజ్ఞాన సర్వసం గా దినదినాభివృద్ధి చెందుతున్న వికిపీడియా లో తెలుగు వారి వంతు ప్రశంసనీయంగా పెరిగిందంటే బ్లాగరుల సహాయ సహకారాలే ప్రధాన కారణం.
గతంలో ఏకొద్దిమందికో పరిమితమైపోయిన బ్లాగులు క్రమక్రమగా జనాభాలో ఎక్కువ మందికి అందుబాటులోకి రావటానికి సాంకేతిక కారణాలతోపాటు సాంస్కృతిక అంశాలూ దోహదం చేస్తున్నాయి.ఎందరో ప్రతిభావంతమైన రచనలను తమ బ్లాగుల ద్వారా మనకు అందిస్తున్నారు.ఎంతో మంది మట్టిలో మాణిక్యాల లాంటి సృజన శీ లులు బ్లాగులలోకంలో తమపాదముద్రలను ప్రతిష్ఠిస్తున్నారు. అదీఇదీ అని పరిమితులు లేకుండా దాదాపుగా సమకాలీన సమాజంలోని అన్ని విషయాలమీద తమ అభిప్రాయాలను స్పష్టంగా,తమదైన శైలిలో వ్యక్తీకరిస్తున్నారు.
పాఠకులు ఇచ్చే సూచనల మేరకు ఎప్పటికప్పుడు తమ భాష,రచనా సంవిధానంలో మార్పులు చేసుకుంటూ మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు.కళలు,సాహిత్యం,సినిమా.హాస్యం,కవిత్వం,సాహితీ విమర్శ, రాజకీయాలు,సాంకేతిక రంగం ఇలా ప్రతి అంశాలోనూ నిష్ణాతులైన రచయితలు బ్లాగర్లలో ఉన్నారు. అయితే ఇక్కద కొన్ని కీలకాంశాలను కూడా ప్రస్తావించుకోవాలి.లబ్ధ ప్రతిష్తులైన ఎందరో ఏ కారణాల చేతనో తెలియదు కాని బ్లాగుల రచనలకు దూరంగా ఉంటున్నారు.కొందరికి తమ రచన మీద బ్లాగుల్లో ఎంతో రసవత్తరమైన చర్చ జరిగిన విషయం కూడా తెలియట్లేదు .అది వారి తప్పు అని మనం అనలేము.వారిని క్రమక్రంగా బ్లాగురచనలకు ప్రోత్సాహించాలి.ఒక మిత్రుడు అన్నట్లు ఆర్ధిక కారాణాలు కూడా ఇందులో అంతర్భాగం కావచ్చేమో కానీ అదే అసలు కీలకం అని నేను భావించటం లేదు.సందర్భం వచ్చింది కాబట్టి,బ్లాగు రచనల ద్వారా ఏమయినా రాబడి ఉంటుందేమో కనీసం భవిష్యత్తులో యాడ్ సెన్స్ కాకుండా పెద్దలు ఆలోచించాలి.ఈ యాడ్ సెన్స్ మతలబు ఏమిటో ఇంతవరకూ నాకు అంతుబట్టలేదు,బహుశా నాలాంటి వారు ఇంకెందురున్నారో.
బ్లాగర్లలో ఎక్కువ మందిని కలవరపెడుతున్న అంశం మరింత పాఠకాదరణ పొందటం.దాదాపు అన్ని బ్లాగులకూ పాఠకులున్నారు,ఉంటారు కూడా. కానీ బ్లాగరు తాను ఎంతో శ్రమకోర్చి రాసినప్పుడు పఠితల స్పందనను ఆశించటంలో తప్పు లేదు.కానీ ఇక్కడ అదే కొరవడుతోంది చాలా మంది విషయంలో. అన్ని బ్లాగులూ చదివి అందర్నీ వ్యాఖ్యానాలు చేయమని అనలేము గాని,నచ్చితే ఒకముక్క,నచ్చక పోతే రెండు ముక్కలు రాసేందుకు అవకాశముంది.కామెంట్లు రాయటంవల్ల ఒక రచన మీద మన అంచనా రచయితకు తెలియ జేయొచ్చు అలాగే మనలోని చోటా సాహితీ విమర్శకుడికి ఒక దారీ చూయించొచ్చు.
బ్లాగును ఎక్కువ మంది పాఠకుల వద్దకు తీసుకు వెళ్ళటం అనేది మరో అంశం. ఎవరికి వారు బ్లాగు రాసుకున్నా ఒక యాగ్రిగేటరు సాయం లేనిదే ఆ బ్లాగ్ వెలుగు చూసే అవకాశాలు తక్కువ కాబట్టి ముందా యాగ్రిగేటరును ప్రజబాహుళ్యంలో ప్రచారం చేయాలి.తద్వారా స్వామికార్యం స్వకార్యం రెండూ నెరవేరే అవకాశం ఉంది.
అదే విధంగా వీలయినన్ని డైరెక్టరీలలో మన బ్లాగును సబ్మిట్ చేయటంవల్ల కూడా కొంతమేరకు ఫలితాలు ఆశాజనకంగా ఉండొచ్చు.దాని వల్ల తెలుగు బ్లాగులుతో పాటు మనమూ విదేశీజనాల కళ్ళల్లొ పడే అవకాశం ఉంది. నేను తెలుగులో బ్లాగు ప్రారంభించిన కొత్తలో టెక్నొరటిలో నార్యాంకు నలభై నాలుగు లక్షల చిల్లర కొద్ది రోజుల తర్వాత ఇరవై లక్షల చిల్లర అంటే సుమారు 30లక్షలకు దగ్గరలో స్థిరంగా ఉండి పోయింది.అదేవిధంగా సులేఖా లో కూడా ప్రయత్నించొచ్చు.
ఇంకా ఉంది....